విజయవాడకు చేరుకున్న ఎన్.డి.ఆర్.ఎఫ్..!

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్.డి.ఆర్.ఎఫ్. (విపత్తుల నిర్వహణ సంస్థ) టీమ్స్ విజయవాడకు చేరుకున్నాయి. పంజాబ్ నుంచి 4, తమిళనాడు నుంచి 3, ఒడిశా నుంచి 3 ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు విజయవాడకు సోమవారం ఉదయానికి చేరుకున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో సహా ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు వచ్చాయి. ఇప్పటికే 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మధ్యాహ్నం లోపు మరో 4 హెలికాప్టర్లు విజయవాడకు వస్తాయి. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని ఎన్.డి.ఆర్.ఎఫ్. మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్.కి దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu