ఎన్సీపీ మద్దతు ప్రకటన.. ఉద్ధవ్ ఉలికిపాటు...
posted on Oct 21, 2014 12:49PM

మహారాష్ట్ర ఎన్నికల ముందు బీజేపీ నుంచి విడిపోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఇప్పుడు ఎన్నికల ఫలితాల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితికి రావడంతో మళ్ళీ బీజేపీతో స్నేహం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే శివసేన బ్లాక్ మెయిలింగ్ గురించి తెలిసిన బీజేపీ మద్దతు తీసుకునే విషయాన్ని ఆలోచిస్తోంది. శివసేనని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకుంటే బావుండని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తాము బయటనుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ ప్రకటించడంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఉలిక్కిపడ్డాడు. ఎన్సీపీ నాయకులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, అవినీతిపరులైన తమ పార్టీ నాయకులను కాపాడుకోడానికే బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తామంటున్నారని మండిపడ్డారు.