నవాజ్ ఆస్తుల జప్తు

అసలే కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరో షాక్ తగిలింది. పనామా పేపర్స్‌లో అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ వచ్చిన కథనాలపై విచారణ చేపట్టిన పాక్ అవినీతి నిరోధక సంస్థ(ఎన్ఏబీ) నవాజ్ ఆస్తులతో పాటు..అతని కుటుంబసభ్యుల ఖాతాలు నిలిపివేయాలని తెలిపింది. ఖాతాలో లావాదేవిలు నిలిపివేయాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌తో పాటు ఇతర బ్యాంకులకు ఎన్ఏబీ లేఖలు రాసింది. అంతేకాకుండా ఆయన ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..లాహోర్‌ శివార్లలో ఉన్న ఆయన నివాసం బయట ఇందుకు సంబంధించి నోటీసులు అంటించారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ లండన్‌లో ఉన్నారు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu