కుప్పకూలిన హరికృష్ణ

 

నల్గొండ జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కుమారుడు పెద్ద నందమూరి జానకిరామ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నందమూరి హరికృష్ణకు తెలియజేయడానికి ఆయన కుటుంబ సభ్యులు తటపటాయించారు. ఎట్టకేలకు ఆయనకు జానకిరామ్ మరణించిన విషయం తెలియజేశారు. ఈ వార్త విన్నవెంటనే నందమూరి హరికృష్ణ కుప్పకూలారు. కొద్దిసేప స్పృహ కోల్పోయిన ఆయన భోరున విలపిస్తున్నట్టు తెలుస్తోంది. జానకిరామ్ మరణ వార్త తెలిసిన వెంటనే నందమూరి, నారా వంశాలకు చెందిన అనేకమంది బంధువులు, మిత్రులు నందమూరి హరికృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. హరికృష్ణ ఇంటి పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu