అది భరించలేకే పార్టీని వీడా.. మైసూరా రెడ్డి

 

వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి మరోసారి జగన్ పై మండిపడ్డారు. కష్టకాలంలో ఉన్న వైసీపీకి అండగా నిలిచిన నా వెనుకే గోతులు తవ్వారని.. అది భరించలేకే పార్టీని వీడానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానకు ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని.. భవిష్యత్ రాజకీయ ప్రయాణం గురించి తాను చెప్పలేనని అన్నారు. రాజ్యసభ పదవిని తాను అడగలేదని, నాకే ఇస్తానని జగన్ ఏడాదిన్నరగా చెబుతున్నారన్నారని.. పార్టీ వదలడానికి, పదవికి ఎలాంటి సంబంధం లేదని.. విజయ సాయి రెడ్డికి ఇచ్చినా, మరొకరికి ఇచ్చినా తనకు సంబంధం లేదని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu