ప్రధానికి బీజింగ్‌లో ఘన స్వాగతం

 

 

భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనలో వున్న విషయం తెలిసిందే. ఆయన చైనా పర్యటనలో రెండోరోజు శుక్రవారం నాడు బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ దగ్గర నరేంద్రమోడీకి చైనా ప్రభుత్వం అధికారికంగా ఘన స్వాగతాన్ని అందించింది. మోడీ స్వాగత కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కెషాంగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత మోడీ, లీ కెషాంగ్ సమావేశమయ్యారు. సరిహద్దు సమస్య గురించి, భారత్‌లో చైనా పెట్టుబడులు పెట్టే అంశం గురించి చర్చించారు. సమావేశం కొనసాగుతోంది. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం వుంది. మోడీ శనివారం నాడు చైనా సంస్థల సీఇఓలతో సమావేశం అవుతారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu