మోడీకి మూడీస్ హెచ్చరిక.. నేతలను అదుపులో పెట్టుకోండి


దేశంలో బీఫ్ వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వివాదల వల్ల రోజుకొకరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదలకు గాను మూడీస్ అనే కన్సల్టెన్సీ సంస్థ మోడీకి ఒక హెచ్చరిక జారీ చేసింది. బీఫ్ మాంసంపై చెలరేగుతున్న వివాదాలలో బీజేపీ నేతలను కట్టడి చేయడం శ్రేయస్కరనమని.. లేకపోతే ఇటు దేశీయంగాను.. అంతర్జాతీయంగాను విశ్వసతను కోల్పోవాల్సి వస్తుందని సూచించింది. సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి చేటు చేస్తున్నాయని.. ఉద్రిక్తతలు మరింత పెరిగిన పక్షంలో రాజ్యసభలో విపక్షాల నుంచి వ్యతిరేకతా పెరుగుతుందని, ఆర్థిక విధానాలపై చర్చలు పక్కదారి పట్టే అవకాశం ఉందని మూడీస్ అనలిటిక్స్ ఒక నివేదికలో వివరించింది. కాబట్టి, మోదీ తన పార్టీ నేతలను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu