మిస్ ఇండియాగా సుమన్ రావ్
posted on Jun 17, 2019 11:49AM
ముంబయిలోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ ఇండియా కాంటెస్ట్ లో రాజస్తాన్కు చెందిన సుమన్ రావ్ మిస్ ఇండియా 2019 విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో మిస్ గ్రాండ్ ఇండియాగా శివానీ జాదవ్, మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్గా శ్రేయా శంకర్, మిస్ ఇండియా రన్నరప్గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు.
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, నటీనటులు హిమాఖురేషీ, చిత్రాంగధసింగ్, ఆయుష్ శర్మ, ప్రముఖ డిజైనర్ ద్వయం ఫాల్గుని షేన్ పీకాక్ , భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. దర్శకుడు కరణ్జోహర్, నటుడు మనీష్పాల్, 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ నటీనటులు కత్రినాకైఫ్, విక్కీకౌషల్, మౌనీరాయ్ తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.