పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రి

అగ్రిగోల్డ్ భూముల విషయంలో తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తంచేశారు, తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న పుల్లారావు... పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ లీడర్స్ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు పత్రాలు చూపిస్తూ మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు, వివాదాస్పద అగ్రిగోల్డ్ భూములను తాను తక్కువ ధరకు కొనుగోలు చేశానంటూ ఆరోపించిన మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu