రాజీనామా పై చిరుకి ప్రధాని ఫోన్
posted on Oct 4, 2013 3:08PM
కేంద్ర మంత్రి చిరంజీవికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఫోన్ చేసిన ప్రధాని మన్మోహన్ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారట. కానీ చిరంజీవి మన్మోహన్ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తనను ఎంతగానో బాధించిందని.. కాబట్టి రాజీనామా వెనక్కి తీసుకోనని చెప్పానట్లు సమాచారం.
మరో కేంద్ర మంత్రి పళ్లం రాజు సోనియాతో భేటీ అయ్యారు. భేటీలో ఏం మాట్లాడిందీ ఆయన వెల్లడించలేదు కానీ.. అధిష్టానానికి వ్యతిరేకంగా మీడియా ముందు గళం విప్పారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రజలకు నమ్మకం ద్రోహం చేసిందని విమర్శించారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వచ్చి ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాక నిర్ణయం తీసుకుంటుందని భావించామని.. కానీ అంతలోనే కేబినెట్ ముందు నోట్ పెట్టి హడావుడిగా విభజన చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.