అక్షయ్‌ కుమార్, సైనా నెహ్వాల్‌లకు మావోల వార్నింగ్

బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్, భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చాయి. అసలు మ్యాటరేంటంటే అక్షయ్ ఇటీవల జవాన్ల కోసం "భారత్ కా వీర్" పేరిట వెబ్‌సైట్ ప్రారంభించి దీని ద్వారా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. మరో వైపు సైనా కూడా మార్చిలో సుకుమా జిల్లాలో మావోల దాడుల్లో మరణించిన 12 మంది జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల ఇచ్చింది. అయితే సాయుధ బలగాలకు ఇలాంటి సాయాలను మానుకోవాలని మావోలు వీరిద్దరికి హెచ్చరికలు చేశారు. నిన్న ఛత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్‌ జిల్లాలో పోలీసులకు కొన్ని కరపత్రాలు లభించాయి. వీటిలో అక్షయ్, సైనాలు జవాన్ల కుటుంబాలకు సాయం చేయకూడదని హిందీ, గోండి భాషల్లో రాశారు. తాజా ఘటనతో అక్షయ్, సైనాల ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.