రంగారెడ్డి జిల్లా  అడిషనల్ కలెక్టర్ తో భేటీ అయిన మంచు మనోజ్ 

మంచు మోహన్ బాబు ఇంట్లో రోజుకో ట్విస్ట్ చేసుకుంటుంది.  తన కష్టార్జితమైన రంగా రెడ్డి జిల్లా జల్ పల్లి నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని గతంలో మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ , కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇది ఫ్యామిలీ గొడవ అనుకున్నారు. అందరూ.  అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో మోహన్ బాబు జిల్లా మెజిస్టేట్ అయిన రంగారెడ్డి కలెక్టర్ కు మరో మారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ మంచు మనోజ్ కు   నోటీసులు  ఇవ్వడంతో శనివారం మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తో భేటీ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నట్టు వివరణ ఇచ్చుకున్నారు.