రెచ్చిపోయిన ఉగ్రవాదులు... ఇంగ్లండ్ పై ఆత్మహుతి దాడి.

 

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తరచూ ఎక్కడో ఒకచోట దాడులు జరిపే ఉగ్రవాదులు..ఈసారి ఇంగ్లాండ్‌ పై తమ పంజా విసిరారు. వివరాల ప్రకారం... ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్‌ ఎరీనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరి జరుగుతుంది. ఈ కచేరికి గాను భారీ ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అక్కడ ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

కాగా ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉగ్రవాదులు చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యానని మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.