హార్ట్ టచ్ చేసిన ‘మనం’ ట్రైలర్

 

అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ‘మనం’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని తన కొడుకు, మనవళ్ళతో కలసి నటించారు. ప్రపంచ సినిమా రంగంలో ఒక అరుదైన ఘనతను దక్కించుకున్నారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ‘మనం’ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 23న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు ట్రైలర్‌లో చెప్పారు. ‘మనం’ ట్రైలర్ విడుదల కాగానే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూశారు. ట్రైలర్ ఆకట్టుకునేలా వుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ట్రైలర్‌లో అక్కినేనిని చూసిన వారు మాత్రం కాస్తంత ఉద్వేగానికి గురవుతున్నారు. ఇంత మహానటుడు మనమధ్య లేరన్న వాస్తవం గుర్తొచ్చి ఫీలవుతున్నారు. మొత్తమ్మీద ‘మనం’ ట్రైలర్ ప్రేక్షకుల హృదయాలను స్పృశించింది.