2.76 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్!

తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  తన తొలి బడ్జెట్‌ను శనివారం (ఫిబ్రవరి 10) ప్రవేశ పెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న భట్టి విక్రమార్క, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, అలాగే . విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి సముచితంగా నిధులు కేటాయించామని వివరించారు.  2,75,891   కోట్లతో తెలంగాణ ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మల్లు భట్టివిక్రమార్క ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు,  మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. 

మల్లు తన బడ్జెట్ ప్రసంగంలో  మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించకున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించామన్నారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మారణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్న నమ్మకాన్ని పొందారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కాగా శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.