మహేష్ "ఆగడు"కు ముహూర్తం ఖరారు

 

మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రం"ఆగడు". ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 16న ముహూర్తం షాట్‌తో ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పాటల కంపోసింగ్ ను సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే మొదలుపెట్టేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని"దూకుడు"ని మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నాడని తెలిసింది.

మహేష్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.