బాబు గారు... గాడిద పని గాడిద చేస్తుంది..

 

లోక్‌స‌త్తా అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ రాజకీయ విమర్శలు చేయడం చాలా తక్కువ. ఎప్పుడో కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై, నేతల రాజకీయ విధానాలపై ప్రశ్నింస్తుంటారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యాడు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు, మేనిఫెస్టోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.  మేనిఫెస్టో ప్ర‌క‌టించార‌ని కాదు.. అస‌లు మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌న దేశంలో సాంకేతిక అంశాల‌న్నింటినేమో.. రాజ‌కీయ నాయ‌కులు నిర్ణ‌యిస్తారు. మ‌రోప‌క్క రాజ‌కీయ అంశాల‌న్నీ కూడా నిపుణులు నిర్ణ‌యిస్తార‌ట.. ఇది ఎలా సాధ్య‌మ‌న్నారు. రాజ‌కీయం ప‌ని రాజ‌కీయానిది, నిపుణుల ప‌ని నిపుణుల‌ది అంటూ గుర్రంప‌ని గాడిద చేయ‌కూడ‌దు..గాడిద ప‌ని గుర్రం చేయ‌కూడ‌దు అంటూ చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చుర‌క‌లంటించారు జేపీ. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డింద‌న్నారు.