ఐటీలో తెలంగాణను టాప్ గా నిలుపుతా౦: కేటీఆర్

 

 

 

తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఇవాళ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ ప్రతినిధులతో ఆయన సమావేశమైన అనంతరం మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణను దేశంలోనే టాప్-5గా నిలుపుతామని తెలిపారు. ఈనెల 27న హోటల్ తాజ్ బంజారాలో 150 ఐటీ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో 15 ఏళ్లకు సరిపడా టెక్నాలజీని సమకూరుస్తామని తెలిపారు. ఈ-పంచాయతీ, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్ సేవలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. ఐటీఐఆర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అనర్హులకు కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని, ఫించన్లూ అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై సరియైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu