ప్రతిపక్షాలకు 'షాక్' ఇచ్చిన కిరణ్ కుమార్

Kiran Kumar Reddy Shock To Opposition, Chief Minister Kiran Kumar Reddy Shock Opposition Parties,  AP Chief Minister Kiran Shocked Opposition

 

తొమ్మిది లెఫ్ట్ పార్టీలు ఇందిరాపార్క్ వద్ద విద్యుత్ ఛార్జీల పెంపుదల నిలపాలని నిరాహార దీక్షలు చేసింది. వారి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విద్యుత్ సంక్షోభం, సర్ ఛార్జీల పేరిట ప్రభుత్వం పెదప్రజలపై పెనుభారం మోపుతుందని, ఛార్జీలు తగ్గించేవరకూ నిరాహార దీక్షలు చేపట్టారు. నాలుగోరోజు అర్థరాత్రి వీరి దీక్షా శిభిరాన్ని కూడా పోలీసులు భగ్నం చేసి దీక్ష చేస్తున్నవారిని హాస్పిటల్ కు తరలించారు. వైఎస్సార్సీపీ సభ్యులు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన రోజు అసెంబ్లీ ఎదుటే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ బైఠాయించారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. టి.ఆర్.ఎస్. బడ్జెట్ సమావేశాలలో విద్యుత్ ఛార్జీల పెంపుపై తమ నిరసనను తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏదో ఒక విధంగా తమ నిరసనలు తెలియజేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేఖాతరు చేస్తూ ఈ.ఆర్.సి.కి ఛార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ ఒకటినుండి అమలులోకి రానున్నాయి. పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. గృహ సముదాయాలకు 50 లోపు యూనిట్లకు 1.45, 51-100 యూనిట్లకు 3.25, 101-150 యూనిట్లకు 4.88, 151-200 యూనిట్లకు 5.63, 201-250 యూనిట్లకు 6.38, 251-300 యూనిట్లకు 6.88, 301-400 యూనిట్లకు 7.38, 401-500 యూనిట్లకు 7.88, 500 కంటే ఎక్కువ యూనిట్లు వాడుకున్నవారికి 8.38చొప్పున రెట్లు వసూలు చేస్తారు. అలాగే పరిశ్రమలకు కూడా యూనిట్ కు రూ.6.08 గా నిర్ణయించారు. దీంతో అటు గృహ వినియోగదారుడిని, ఇటు పరిశ్రమల వారిని ఈ.అర.సి. వదలలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ నిర్ణయించేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu