లోకసభ ఎన్నికలకు కేసీఆర్ పక్కా వ్యూహం

అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్  అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా  వ్యూహంతో ఉన్నట్లు కనబడుతోంది.  

2024 ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాలని కొంతమంది మంత్రులకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.  ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని  ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు సూచించారు. మరికొంత మంది ఎంపీలకు పార్టీ నాయకత్వ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జి. జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులను ఎంపీలుగా పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27న జరిగే బీఆర్‌ఎస్ స్థాపన దినోత్సవం తర్వాత పోటీదారుల విషయం మరింత  క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.  2024లో కనీసం తొమ్మిది లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడానికి నేరుగా మంత్రులను రంగంలోకి దించాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి, సికింద్రాబాద్, నల్గొండ లోకసభ స్థానాలకు మంత్రులను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. , మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ , చేవెళ్ల. లోక్‌సభ ఎన్నికల కోసం మంత్రులతో పాటు అసెంబ్లీ, మండలిలో  ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను కూడా  ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు.

బీఆర్ ఎస్ ఇప్పటి వరకు నల్గొండ, సికింద్రాబాద్ నియోజకవర్గాలను కైవసం చేసుకోలేదు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసింది. మెదక్ ఎంపీ కొత్త కోట ప్రకాశ్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు. 2014లో మొదటి సారి, 2019లో రెండోసారి గెలుపొందారు. 

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలపై సీఎం ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.

2024లో మొత్తం 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో సీఎం "మిషన్-16" లక్ష్యాన్ని నిర్దేశించారు, మిగిలిన ఒక్క హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని దాని మిత్ర పక్షమైన మజ్లిస్ కే వదిలివేసారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో పార్టీ తన ప్రభావాన్ని చూపాలంటే తెలంగాణలో లోక్‌సభ న్నికల్లో క్లీన్‌స్వీప్ చేయాల్సిందేనని కేసీఆర్  గట్టి అభిప్రాయం. 2019 లోక్‌సభ ఎన్నికలకు  సీఎం మిషన్-16 లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు.  పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

టీఆర్ఎస్  2014లో 11 లోకసభ స్థానాలలో గెలుపొందింది.   2019లో టీఆర్ఎస్  9 స్థానాలకు  పడిపోయింది. అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను మార్చినట్లయితే దీనికి చెక్ పెట్టవచ్చని బీఆర్ఎస్  నాయకత్వం అభిప్రాయపడుతోంది. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu