కాంగ్రెస్ తో కవిత బేరం? నిజమేనా?
posted on May 29, 2025 9:25AM

సర్కమ్ స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్.. అంటూ ఒకటుంటుంది. దీని అర్ధమేంటంటే వారి వారి మానసిక- శారీరక- సామాజిక- రాజకీయ- ఆర్ధిక- స్థితిగతులను అనుసరించి వారెలా బిహేవ్ చేస్తారో.. ఒక అంచనాకు రావడం. దీన్నే ఇప్పుడు రెడ్ టీమిజం అని కొత్తగా కూడా పిలుస్తున్నారు. ఇది వేరే విషయం.
ఇక్కడ కవితకు అలాంటి పరిస్థితి ఉందా? లేక బీఆర్ఎస్ పార్టీకే ఇలాంటి సిట్యువేషన్ తలెత్తిందా? అని చూస్తే ఇది జస్ట్ కవిత పరిస్థితిలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఒక వేళ కవితే కాంగ్రెస్ లోకి వెళ్తే.. కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఈ- కార్ రేస్ విషయంలో కావచ్చూ.. బీఆర్ఎస్ కి ఒక రిలీఫ్ రావచ్చు. కారణమేంటంటే.. కవితే కాంగ్రెస్ లో ఉంటే.. ఇలాంటి అంశాల్లో చేతి పార్టీ ప్రభుత్వం అంత అగ్రెసివ్ గా దూకుడు ప్రదర్శించక పోవచ్చు. దీంతో కవిత ద్వారా కేసీఆర్ ఇటు నుంచి నరుక్కొస్తున్నదిగా ఒక అంచనా.
ఇక రెండోది.. దీన్ని రేవంత్ , ఆయన సన్నిహితులు ఇటు పీసీసీ అటు కేంద్ర నాయకత్వాన్ని వద్దని వారించినట్టు భావించడం. అదేమంటే అనవసరంగా కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన నింద మన మీద వేసుకోవడం ఎందుకని.. వారు అనుకున్నట్టు! అందుకే వద్దన్నట్టు చెప్పడం కూడా ఒకరకంగా.. తాను చంపబోయే జింకను చూసి పులే జాలి పడ్డట్టుగా ఉంది.
ఇప్పుడు నడుస్తోన్నదంతా ఏంటి? తనను కేసీఆర్ జైలుకు పంపినట్టే నేను కూడా ఆయన్ను పంపాలన్నదే కదా? కేటీఆర్ ని కూడా వదలకుండా వెంటాడి వేటాడి రివేంజ్ తీర్చుకోవడమే అసలు ఉద్దేశం అదే కదా? అంటారు కొందరు ఎనలిస్టులు.
బేసిగ్గా ఇవన్నీ జరక్కుండా కడియం శ్రీహరి చెప్పినట్టు కేసీఆర్ తొలి నాళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ఉండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొందర్ని కొని.. సొంతంగా అధికారంలోకి రావచ్చు. ఇందుకు ఆస్కారాలు లేక పోలేదు. కానీ కేసీఆర్ అసలైన ఆలోచన అది కాదు. డీఎంకే, అన్నాడీఎంకే ఫార్ములా... అంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్, టీబీఆర్ఎస్ ఉండాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక వేళ అలా లేకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ లో మన వాళ్లు ఎవరో ఒకరుండటం. మరీ లేకుంటే బీజేపీలో ఉండటం. ఒక సారి మనం (అంటే బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చినా.. రెండో సారి అటు వైపు వాళ్లు(కాంగ్రెస్ లేదా బీజేపీ) అధికారంలోకి వచ్చినా.. మన వాళ్లు అటు వైపు ఉంటారు కాబట్టి.. మనం ఎన్ని చేసినా చెల్లుబాటు అయ్యేలా ఒక ఎత్తుగడ. ఇదీ కేసీఆర్ 2018 నాటి నుంచి కలలు కంటోన్న పొలిటికల్- స్కెచ్.
ఇప్పుడున్న రోజుల్లో అధికారంలో లేకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పరిపాలనలో ఏవో ఒక లోటు పాట్లు ఉండనే ఉంటాయి. అధికారం పోయాక వాటిని అడ్డు పెట్టుకుని ఏవో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ కండీషన్లో.. మనమలా ఇరుకున పడకుండా ఉండాలంటే ఇదే సేఫ్ ప్లాన్. ఇందులో భాగమే ఒక కవిత- ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి పదవి కాన్సెప్ట్ గా అంచనా వేస్తున్నారు కొందరు. అర్ధమవుతోందా!?