కాశ్మీర్‌లో పాక్ కాల్పులు ఐదుగురు మృతి

 

పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లోని ఆర్నియా సెబ్ సెక్టార్‌లో బీఎస్ఎఫ్ జవాన్ల స్థావరాలపై కాల్పులు జరిపారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందగా, సుమారు 29 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. మృతి చెందినవారిలో తండ్రీ కూతుళ్లు ఉన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News