ఉరీపై మరోసారి దాడి

తమ ఉగ్రవాద చర్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎండగట్టడంతో..పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో భారత్‌ అంటే మండిపడుతోంది..ఈ నేపథ్యంలో డైరెక్ట్‌గా మనల్ని ఎదుర్కొలేక..ఉగ్రవాదుల్ని ఎగదోసింది..బారాముల్లా జిల్లాలోని వ్యూహాత్మక ఉరీ సెక్టార్‌పై మరోసారి దాడికి తెగబడే ఎత్తు వేసింది. ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సైన్యానికి సమాచారం అందడంతో పక్కా ప్రణాళికతో కల్గాయ్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాన్ని చుట్టుముట్టాయి..దీంతో ముష్కరులకు, సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఒక ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు అక్కడ నక్కినట్లు తెలుస్తోంది.