హర్షకుమార్‌తో ముద్రగడ భేటీ

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్‌ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగస్టుతో ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం నిర్ణయం అటు ఇటు జరిగిన పక్షంలో మళ్లీ ఉద్యమం నిర్వహించేందుకు ముద్రగడ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరిని కలుపుకుపోవాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన హర్షకుమార్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్లు తెలిపారు.