ఒంగోలు "మినీ మహానాడు" ఘటనపై సీఎం ఆగ్రహం

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న జరిగిన మినీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. అధికార పార్టీ నేత కరణం బలరాం, కొత్తగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రులు రావెల కిశోర్‌బాబు, శిద్దా రాఘవరావు, పార్టీ పరిశీలకుడు బుచ్చయ్య చౌదరి సమక్షంలోనే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మనస్పర్థలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి తప్ప..బహిరంగంగా పార్టీ పరువు తీయోద్దన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.