ప్రసంగిస్తూ పడిపోయిన కడియం శ్రీహరి...

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ లో నిర్వహించిన వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో  వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆయనను వెంటనే లేపి పక్కన కూర్చోబెట్టారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu