సంచలనం.. పవన్ కళ్యాణ్ తో కేఏ పాల్ పొత్తు!!!

 

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి ఏపీ రాజకీయాల్లో సంచలనాలు క్రియేట్ చేస్తా అంటూ హడావుడి చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మరి ఆయన సంచలనాలు క్రియేట్ చేస్తారో లేదో తెలీదు కానీ సంచలన వ్యాఖ్యలు మాత్రం చేస్తున్నారు. ఏపీకి నెక్స్ట్ సీఎం నేనేనని, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతో కలిసి పనిచేస్తే బాగుంటుందని ఇలా ఇప్పటికే ఎన్నో వ్యాఖ్యలు చేసిన పాల్.. తాజాగా జనసేనతో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ తో ఏపి  అసెంబ్లీ ఎన్నికల్లో పోత్తులపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇరు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని అన్నారు. మొత్తంగా తమ మధ్య జరుగుతున్న చర్చల వివరాలు త్వరలో వెల్లడిస్తామని పాల్ తెలిపారు. అయితే తమతో పొత్తుల వల్ల జనసేన పార్టీయే  ఎక్కువ లాభపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఒక్కసీటు కూడా గెలవలేరని అన్నారు. అందువల్ల పవన్ పొత్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పాల్ సూచించారు.

ప్రజాశాంతి పార్టీలో చేరడానికి చాలా మంది నాయకులు సిద్దంగా వున్నారని పాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తనతో టచ్ లో వున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలో వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరతారని పాల్ వెల్లడించారు. ఇక తమ పార్టీకి ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తు కేటాయించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది మేలో ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పాల్ ధీమా వ్యక్తం చేశారు.