రెండున్నరేళ్లలో మళ్ళి ఎన్నికలు: జెసి సంచలన కామెంట్స్

 

 

జెసి దివాకర్ రెడ్డి ఏది మాట్లాడినా, ఎవరి పై వ్యాఖ్యలు చేసినా అది సంచలనమే. సొంత పార్టీ అధినేత నుండి ప్రతిపక్ష నేత వరకు ఎవరిని వదిలి పెట్టకుండా విమర్శించే సత్తా కలిగిన నేత జెసి. ఐతే అయన తాజాగా శింగనమల నియోజకవర్గంలో జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో జగన్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం జగన్ ఒక మూర్ఖుడిలాగ రాష్ట్రంలో పాలన చేస్తున్నాడని, చంద్రబాబు ఎంతో కష్టపడి పోలవరం నిర్మిస్తుంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ఆ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేసి, రీ టెండరింగ్ కు వెళ్ళటం బాధాకరం అని అన్నారు. ప్రజలు జగన్ కు తప్పనిసరిగా బుద్ధి చెప్పడం ఖాయమని, మరో రెండున్నర సంవత్సరాలలో మళ్ళి ఎన్నికలు రావడం ఖాయమని అయన జోస్యం చెప్పారు. మరో ఆరు నెలల్లో జగన్‌ పార్టీకి ప్రజలలో వ్యతిరేకత వస్తుందని, అప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఓపిగ్గా ఉండాలని అయన చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తే వాళ్ళకి తాము అండగా నిలబడి పోరాటం చేస్తామని అయన భరోసా ఇచ్చారు.