ఏపీ హోదా.. చీర, పూలు, జాకెట్లతో నిరసన

 

ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని నిన్న లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల చర్చలో కేంద్రమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పై రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో టిడిపి పూర్తిగా విఫలమయ్యిందని.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇంటిముందు ఏఐవైఎఫ్‌ నాయకులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా చీర, పూలు, జాకెట్లతో నిరసన తెలిపారు. మరోవైపు ఉరవకొండలో ప్రజలు ఇంకొంచం వెరైటీగీ నిరసన తెలిపారు. మొహాలకు ముసుగులు వేసుకొని బూట్లను పాలిష్ చేస్తూ తమ నిరసనను తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu