జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు.. రాంజెఠ్మలానీ లాయర్..

 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష, జరిమానా పడిన జయలలిత ఈరోజు నాడు కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకూ హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో జయలలిత తరఫున వాదిస్తున్న న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. ఇదిలా వుంటే ఈ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu