కేసీఆర్ పై జానారెడ్డికి కోపమొచ్చింది

మీరు సీనియర్... మీ సలహాలు తీసుకుంటామంటూ పొగుడుతూ సీఎం కేసీఆర్ ఐస్ చేస్తుంటే... కూల్ గా సెలైంటయిపోయే ప్రతిపక్ష నేత జానారెడ్డికి ఈసారి కోపమొచ్చింది, రైతు ఆత్మహత్యలపై చర్చకు పట్టుబడ్డిన విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఊగిపోయిన జానారెడ్డి... సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది మీరు కాదా అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు, సమస్యలు పట్టించుకోమంటే నిబంధనలు గుర్తుచేస్తారా... అవి మాకు తెలియదా... అంటూ ఫైరయ్యారు, విపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్ అప్రజాస్వామికమన్న జానా... అధికార పార్టీ నిరంకుశ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకే అన్నదాతలకు భరోసా ఇవ్వలేకపోతుందని ఆరోపించారు, సభను స్తంభింపజేయడం తమ ఉద్దేశం కాదన్న జానా... అన్నదాతల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలన్నదే లక్ష్యమన్నారు, అయితే ప్రభుత్వం తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందని, సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కి త్వరలో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు.