హోదా కోసం సుదీర్ఘ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు దిగుతుంటే, వామపక్ష పార్టీలు సుదీర్ఘ పాదయాత్ర చేయాలని తలపెట్టాయి, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేవరకూ ఉద్యమిస్తామంటున్న సీపీఐ, సీపీఎం నేతలు... ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు, ఈనెల 8వ తేదీన అనంతపురం జిల్లా నుంచి  ప్రారంభమయ్యే పాదయాత్ర... శ్రీకాకుళం జిల్లా వరకూ కొనసాగుతుందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధు తెలిపారు.