ఆర్మీ కాన్వాయ్ పై మరోసారి ఉగ్రదాడి...

 

సరిహద్దు ప్రాంతాల్లో తరచూ కాల్పులకు పాల్పడుతూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ మధ్య ఆర్మీ కాన్వాయ్ లపై దాడులు జరుపుతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో  క్వాజిగుండ్‌ ప్రాంతంలో భద్రతా బలగాల వాహన శ్రేణిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సైనికులకు ఎలాంటి గాయాలు తగలలేదు కానీ... ఓ పౌరుడికి బుల్లెట్‌ తగిలి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఉగ్రవాదులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఘటనా స్థలం నుండి ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu