రాజకీయాల్ని జూదంలా మార్చారు.. కేసీఆర్ పై జైపాల్ రెడ్డి ఫైర్

రాజకీయ నాయకులకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడుతుంటారు. రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన రాజకీయ మార్పుల వల్ల కొంతమంది యాక్టివ్ లీడర్స్ కూడా ఎందుకో సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా నోరు తెరిచి విమర్శలు చేస్తూ మేము కూడా ఉన్నామంటూ గుర్తుచేస్తున్నారు. అలాగే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్ రెడ్డి మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్ని జూదంలాగ మార్చేసిందని.. కేసీఆర్ కాసినో పాలిటిక్స్ నడిపిస్తున్నారని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక కేసీఆర్ కు గుణపాఠం చెబుతుందని.. అసలు ఈ ఉపఎన్నిక అవసరం ఎందుకు వచ్చిందో జనం గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తనకు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేశారు.. ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. మొత్తానికి జైపాల్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ.. తను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవడానికి వస్తున్నట్టు సంకేతాలు పంపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu