ఒకరికి బుల్లెట్ తగిలిందంటున్న ఖాకీలు

 

హైదరాబాద్ వనస్థలిపురం ఆటోనగర్ లో జరిగిన పోలీస్ కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు, పోలీసులు కాల్పులు జరిపినా చాకచక్యంగా తప్పించుకున్న స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయమైందని అనుమానిస్తున్నారు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల్లో ఒకరికి బుల్లెట్ తగిలిందని భావిస్తున్న సైబరాబాద్ పోలీసులు... దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, స్నాచర్లు.... ఆటోనగర్ నుంచి చింతల్ కుంట, సాగర్ రింగ్ రోడ్, కర్మాన్ ఘాట్ మీదుగా కంచన్ బాగ్ వైపు పారిపోయినట్లు పోలీసులు సమాచారం సేకరించారు, దాంతో ఆ మార్గంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోనూ పేషెంట్ల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu