కోరుట్లలో విషాదం కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు

 

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జీఎస్ గార్డెన్స్ సమీపంలో వినాయక చవితికి సంబంధించి విగ్రహాల తయారీ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తగలడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారని సమాచారం. వినాయక విగ్రహం తయారీ కార్మికులు పనులు చేస్తుండగా, ఒక్కసారిగా పక్కన ఉన్న ఎలక్ట్రిక్ తీగలు స్పర్శకు వచ్చాయి. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.