జగన్ రిమాండ్ పొడిగింపు

 

 

 

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 3కు పొడిగించింది. ఈరోజుతో జగన్ రిమాండ్ ముగియడంతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బహ్మానందరెడ్డిలను కూడా విడియో కాన్‌ఫ్రోన్స్ ద్వారా కోర్టు విచారణ జరిపి అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజి మంత్రులు దర్మాన ప్రసాదరావు, సభితా ఇంద్రారెడ్డిలు ఈరోజు ఉదయం కోర్టులో హాజరైయ్యారు. సిబిఐ ఇప్పటికి ఈ కేసులో 10 చార్జిషీట్లను దాఖలు చేయగా అందులో 5 చార్జీషీట్లు ఈ నెలలో వేసిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu