జగన్ దీక్ష.. పరామర్శిండానికి వచ్చారా.. ఎటకారం చేయడానికా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న తరుణంలో పలు పార్టీ నేతలు మద్దతుపలుకుతున్నారు. అయితే అందరూ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఒక నేత మాత్రం జగన్ పరామర్శిండానికి వచ్చారో లేదా ఎటకారం ఆడటానికి వచ్చారో తెలియకా అర్ధంకావడంలేదట. సీపీఎం మాజీ ఎంపీ సీనియర్ నేత మధు జగన్ పరామర్శించడానికి వెళ్లి జగన్ తో కొంచెం సేపు ముచ్చటించి ఆఖరికి ''మాకు పోరాటాలే అజెండా... మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు'' అని ఒక మాట అన్నారంట. దానికి ఒక్కసారిగా జగన్ కు ఎమనాలో తెలియక.. నోట మాట రాక.. ఏదో తలాడించి అలా ఊరుకున్నారంట. అయితే మధు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు కోపంగా ఉన్నా.. కొంతమంది మాత్రం మధు అదెదో యథాలాపంగా అన్న మాట కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu