కొన్నిటికే ‘ఆధార్‘.. తేల్చిచెప్పిన సుప్రీం

ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఎల్పీజీ గ్యాస్ కు తప్ప అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి కాదంటూ గతంలో తేల్చిచెప్పిన అత్యున్నత ధర్మాసనం... మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసింది. ప్రతిదానికీ ఆధార్ కార్డు కావాలని కోరడమంటే... అది వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే అన్నిటికీ ఆధార్ కార్డు  తప్పనిసరి కాదని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే దాన్ని వినియోగించాలని సూచించింది. ఓటర్ కార్డుకు ఆధార్ ను లింక్ పెట్టడాన్ని కూడా తప్పుబట్టిన సుప్రీం... ఆధార్ కార్డు ఆధారంగా ఓట్లు తొలగించడం సరికాదంది. అయితే ఆధార్ కార్డు విషయంలో కేంద్రం వైఖరికి భిన్నంగా సుప్రీం ఆదేశాలు, సూచనలు ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.