సోనియాకు చెవుడు... జగన్‌

 

 

 

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సీమాంధ్రవాసుల గోడును ఎందుకు వినడం లేదు? ఈ ప్రశ్నకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దగ్గర చక్కని సమాధానం ఉంది. ఆ సమాధానం ఏమిటంటే... సోనియాకు చెవుడు అట. తన అటు సమైక్యం ఇటు ఓదార్పు రెండిటినీ కలుపుకుని టూ ఇన్‌ వన్‌ యాత్ర చేస్తున్న జగన్‌... శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, రైతులు, అన్ని విధాల నష్టపోతారని ఎంత మొత్తుకుంటున్నా చెవిటివాళ్లయిన కేంద్ర ప్రభుత్వ సారధులకు వినపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఒక తాటి మీదకు రావాలని, వచ్చే ఎన్నికల్లో 30 ఎంపి సీట్లు గెలిపించుకోవాలని, సమైక్యంగా ఉంచేవ్యక్తినే ప్రధానిగా చేసుకుందామని ఆయనన్నారు. మొత్తానికి తనది చెవిటి వాడి ముందు (సమైక్య) శంఖారావం అని జగనే ఒప్పుకున్నారన్నమాట అని కొందరు గుసగుసలాడారు.