బెంగళూరా? పంజాబా?.. నేడే ఐపీఎల్ ఫైనల్

కోహ్లీకి 18 సెంటిమెంట్ కలిసి వస్తుందా?

క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ పైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా.. పంజాబ్ కింగ్సా? అనేది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.  ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతున్నా.. ఈ రెండు టీమ్‌లూ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి.. ఏ టీమ్ గెలిచినా.. కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే.. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పంజాబ్ కింగ్స్‌ని చిత్తుగా ఓడించి నేరుగా ఫైనల్ చేరుకుంది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్.. ముంబై ఇండియన్స్‌పై అద్భుతమైన విజయం సాధించి.. ఫైనల్ చేరింది. రెండూ టీమ్‌లూ.. ఫైనల్ చేరుకునేందుకు సూపర్బ్ గా ఆడుతూ వచ్చాయ్.  అయితే.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్‌ని భారీ తేడాతో ఓడించింది. ఇది.. రాయల్స్‌కి కొంతవరకు అప్పర్ హ్యాండ్ తమదేననే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ.. ఐపీఎల్ ఫైనల్‌లో ఏదైనా జరగొచ్చు. టీ20 క్రికెట్‌లో.. మ్యాచ్‌ని టర్న్ చేసే మూమెంట్స్ చాలా ఉంటాయ్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆఖరి బంతి వరకు.. ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. దాంతో.. ఈసారి కప్పు కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా? లేక.. పంజాబ్ కింగ్సా? అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఫీవర్ పెంచేస్తోంది.

అయితే.. ఐపీఎల్‌‌లో ఇది 18వ సీజన్. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఆర్సీబీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్న ఈ 18 సెంటిమెంట్.. బెంగళూరుని టైటిల్ విన్నర్‌గా నిలుపుతుందా?  లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు.. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని.. ఆర్సీబీ కల ఈసారి నెరవేరుతుందా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. లీగ్‌ దశలో పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ పొజిషన్ సెంటిమెంట్ కూడా.. ఆర్సీబీకి పాజిటివ్ వైబ్ ఇస్తోంది.  ఇప్పటి వరకూ జరిగిన  ఐపీఎల్ హిస్టరీని పరిశీలిస్తే.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టు.. ఏకంగా 8 సార్లు టైటిల్‌ని గెలుచుకుంది. ఈ సెంటిమెంట్ ప్రకారం.. ఆర్సీబీకి కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పోర్ట్స్ అనలిస్టులు భావిస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కూడా.. ఆర్సీబీకి ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లివింగ్ స్టన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉండటం.. ఆర్సీబీకి పెద్ద బలమనే చెప్పాలి.  వీరికి.. ఎలాంటి టైమ్‌లోనైనా మ్యాచ్‌ని టర్న్ చేసే సత్తా ఉంది.  ఇక.. బ్యాలెన్స్‌డ్ బౌలింగ్ కూడా ఆర్సీబీకి కలిసొస్తోంది. యశ్ దయాల్,  జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ లాంటి పేసర్లు, సుయాష్ శర్మ లాంటి స్పిన్నర్లతో.. ఆర్సీబీ ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తోంది. ఇక వరుస విజయాలు, అద్భుతమైన ప్రదర్శన.. ఆర్సీబీలో కాన్ఫిడెన్స్‌ని పెంచాయి. ఇప్పుడు.. ఫైనల్స్ ఆడేందుకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఆర్సీబీ ప్లేయర్లలో ఉంది.

పంజాబ్ కింగ్స్ కూడా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పటికీ.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ని ఓడించి ఫైనల్ చేరుకోవడం.. ఆ టీమ్‌లో కాన్ఫిడెన్స్‌  పెంచింది.  భారీ టార్గెట్లను ఛేదించే సామర్థ్యం.. పంజాబ్ కింగ్స్‌కు ఉంది. ఈ సీజన్‌లో అనేక సార్లు 200 పైగా పరుగులు చేసింది  ఈ టీమ్. దాంతో.. ఫైనల్‌లో ఎంత పెద్ద టార్గెట్‌నైనా ఛేదించగలమనే నమ్మకంతో ఉన్నారు పంజాబ్ ఫ్యాన్స్. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా ఆ జట్టుకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. అతను.. టీమ్‌ని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. జానీ బెయిర్ స్టో, జోష్ ఇంగ్లిష్ లాంటి పవర్ హిట్టర్లు, శ్రేయస్ అయ్యర్, నెహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్ లాంటి బలమైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం వీళ్లకు ఉంది.  ఆల్‌రౌండర్లు.. టీమ్‌కు ఉన్న మరో బలం. అర్ష్‌దీప్ సింగ్, చాహల్, హర్‌ప్రీత్ బార్ లాంటి బౌలర్లు.. కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్నవారు. పేస్, స్పిన్ కలయికతో.. పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లని ఇబ్బంది పెట్టగలరు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో భారీ ఓటమిని చవిచూసినా.. ముంబై ఇండియన్స్‌ లాంటి బలమైన టీమ్‌ని ఓడించి.. ఫైనల్ చేరడం పంజాబ్ కింగ్స్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. మొత్తంగా.. అటు ఆర్సీబీ, ఇటు పంజాబ్ కింగ్స్.. ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలనే  పట్టుదలతో ఉన్నాయ్. అయితే ఫైనల్‌లో ఏ టీమ్ మెరుగైన ప్రదర్శన చేస్తుంది.. ఎవరు ఒత్తిడిని ఎదుర్కొంటారనే దాని మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ ఫైనల్ చేరిన ఆర్సీబీ.. అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పుంజుకున్న పంజాబ్ కింగ్స్.. ఫైనల్‌లో ఉన్నాయ్ కాబట్టి.. ఇదొక.. ఉత్కంఠభరితమైన ఫైనల్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.