భారత సైన్యం చేతిలో ప్రాణాలతో పాక్ ఉగ్రవాది...

 

జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలకు మరో పాక్ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. గతంలో ఒకసారి పాక్ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడగా.. ఇప్పుడు మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం.. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టారులో ఎన్ కౌంటర్ జరగగా.. దీనిలో లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే బహదూర్ అలీ అలియాస్ సైఫుల్లా అనే ఉగ్రవాది మాత్రం ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతని నుండి సైన్యం మూడు రైఫిళ్లు, రెండు పిస్టల్స్ తో పాటు రూ. 23 వేల భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అ సందర్భంగా హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. "పాక్ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకోవడం పెద్ద సక్సెస్. ఉగ్రవాదం వెనుక పాక్ మూలాలు ఉన్నాయన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలుస్తుంది" అని అన్నారు. కాగా గడచిన రెండు నెలల వ్యవధిలో పాక్ ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుబడటం ఇది రెండోసారి.