నాగబాబు వచ్చాడు..అల్లు అర్జున్ ఆర్మీ ఏం చేస్తారు
on May 18, 2024
ఎవరయ్యా అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషయంలో నాగ బాబు తగ్గిందని చెప్పింది. అ క్కడుంది మెగా సెకండ్ లయన్. జస్ట్ గ్యాప్ ఇచ్చానంతే టైమింగ్ లో మనల్ని మించిన వాళ్ళు ఉండరనే చిరు డైలాగ్ కి తగ్గట్టుగా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం
అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీ ఫ్యాన్స్ కి నాగబాబు మధ్య రెండు రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా వార్ నడిచింది. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో బన్నీ తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాడని చెప్పి మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మా వాడే అంటూ ట్వీట్ చేసాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబు కి రివర్స్ కౌంటర్లు వేస్తు ట్వీట్ ల మీద ట్వీట్లు చేస్తు వచ్చారు. దీంతో నాగ బాబు ట్విట్టర్ నుంచి వైదొలిగాడు. కానీ ఇప్పుడు లయన్ ఈజ్ బ్యాక్ అనే రీతిలో ట్విట్టర్ లో కి వచ్చాడు. కాకపోతే ఐ హావ్ డిలిటెడ్ మై ట్వీట్ అంటు ఎంట్రీ ఇచ్చాడు. నేను నా ట్వీట్ ని తొలగిస్తున్నాను అని చెప్పాడు. అన్నట్టుగానే అల్లు అర్జున్ మీద చేసిన పరాయి వాడు అనే ట్వీట్ ని తొలగించాడు. తగ్గాడా లేక చిరు నుంచి వచ్చిన ఆదేశంతోనే అలా చేశాడా అని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు ఒక్క రోజు వ్యవధిలోనే ట్విట్టర్ కి రీ ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి బన్నీ ఫ్యాన్స్ తమ ట్వీట్ లని మళ్ళీ కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి.
నాగ బాబు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గా పని చేస్తున్నాడు. ఆ హోదాలోనే బన్నీ మీద ట్వీట్ చేసాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మెగా ఫ్యాన్స్ చాలా మంది బన్నీ జనసేన తరుపున కాకుండా వేరే పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం మీద కోపంగానే ఉన్నారు. వాళ్ళ కోపం పుష్ప 2 కి ఎంత వరకు పని చేస్తుందో చూడాలి. లేక సినిమా వేరు రాజకీయం వేరు అనే కాన్సెప్ట్ కి దాసోహం అవుతారో
Also Read