దళిత మహిలపై దాడి.. రాజ్యసభలో దుమారం..

 

ఇప్పటికే గుజరాత్ లో యువకులపై దాడి చేసినందుకు చర్య చేపట్టాలని రాజ్యసభలో పెద్ద దుమారమే రేగుతుంది. విపక్ష పార్టీలన్నీ ఈ దాడి గురించి సభలో చర్చ జరగాలని.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల వాగ్వాదాలతో సభ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు దానికి తోడు మరో దాడి జరిగింది.మధ్యప్రదేశ్లో బీఫ్ విక్రయిస్తున్నారని చెప్పి ఇద్దరు దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే వారిని పిచ్చి కొట్టుడు కొట్టారు. గో మాతాకీ జై' అంటూ వారిని కిందపడేసి కొట్టారు. చెంపలు వాయించారు. పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఇప్పుడు ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టయింది. ఈ ఘటనను సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ఎంత మాత్రం చర్చ జరుపుతారో చూద్దాం..