కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు...
posted on Sep 17, 2014 12:32PM
.jpg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి వల్లనే మెట్రో రైలుకు సమస్యలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ మొండి వైఖరి కారణంగానే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకుంటానని లేఖ రాసిందని ఆయన అన్నారు. కేసీఆర్ తీరు కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి రావల్సిన హీరో ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయిందని షబ్బీర్ చెప్పారు. దాంతోపాటు మహేంద్ర ట్రాక్టర్ల యూనిట్ కూడా కేసీఆర్ వైఖరి కారణంగానే బెంగుళూరుకు తరలిపోయిందని అన్నారు. రాబోయే మూడేళ్ల వరకూ తెలంగాణకు కరెంట్ కష్టాలు తప్పవని కేసీఆర్ అంటున్నారని, కేవలం ఆయన నిర్లక్ష్య వైఖరి వల్లే పరిశ్రమలు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని షబ్బీర్ అలీ చెప్పారు. కేసీఆర్ ఇదే ధోరణి కొనసాగిస్తే తెలంగాణ అభివృద్ధి చెందడం కలలో మాటేనని షబ్బర్ అన్నారు.