రోడ్డు ప్రమాదం: హైదరాబాదీలు మృతి

 

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లి దగ్గర మారుతీకారు అదుపు తప్ప రోడ్డు డివైడర్ని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను శ్రీహర్ష, కామేశ్వరరావు, సుమన్ గా పోలీసులు గుర్తించారు. శ్రీహర్ష కాకినాడ వాసి కాగా,మిగతా ఇద్దరు హైదరాబాద్‌కి చెందినవారు. వీరంతా బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu