జీహెచ్ఎంసీ షాక్.. మంచినీటికి బదులు మరుగునీరు

హైదరాబాద్‌లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మున్సిపల్ నాళాలతోపాటు, ఇళ్లలోను మంచినీటికి బదులు మురుగునీరు సరఫరా జరిగింది. సీతారాంబాగ్, మల్లేపల్లి, బోయిగూడ, మంగళ్‌హాట్, ఆగాపూరా, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో ఇవాళ మురుగునీరు సప్లై అయ్యింది. ఈ నీటిని చూసి జనం షాక్‌కు గురయ్యారు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదు గతంలోనూ ఇలాగే మురుగునీరు సరఫరా అయ్యింది. అయినా అధికారుల తీరు మారకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.