మృతులకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి రైల్వే శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటన విడుదల చేశారు. మరణించిన వారికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు నష్టపరిహారం అందిస్తామని సురేష్ ప్రభు తెలిపారు. కాగా ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది ఒడిషాకు చెందినవారే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News