రైలు ప్రమాదం వెనుక మావోలు..?

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద అర్థరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్ర దాగుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మావోయిస్ట్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో వారి హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గ్రేహౌండ్స్ చేతిలో చావు దెబ్బ తిన్న మావోలు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. దీంతో తమ ఉనికిని చాటుకునేందుకు వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.