కర్నూలులో హైకోర్ట్ బెంచ్.. సీఎం గ్రీన్ సిగ్నల్!

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రదిపాదనను కేంద్రానికి పంపుతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు.   రాజ‌ధాని అమరావతిలో   బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా వంద ఎకరాల్లో ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెడతామని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu